వికారాబాద్ : ఈ నెల 11న జరిగే లోక్ అదాలత్లో కేసులను పరిష్కారం చేసుకోవాలని మండల న్యాయ సేవ సంస్థ చైర్మన్ జిల్లా అదనపు న్యాయమూర్తి పద్మ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో కో-ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల న్యాయసేవ సంస్థ చైర్మన్ జిల్లా అదనపు న్యాయమూర్తి పద్మ మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పోలీస్ స్టేషన్లలో నమోదైనటువంటి కేసులను, రాజీ కుదిర్చేలా పోలీసులు చూడాలని తెలిపారు.
రాజీయే రాజమార్గమని అందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయమూర్తి శ్రీదేవి, జూనియర్ న్యాయమూర్తి శ్రీకాంత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, జనరల్ సెక్రటరీ రమేశ్ ముదిరాజ్, న్యాయవాదులు పాల్గొన్నారు.