బంట్వారం : బంట్వారం మండల కేంద్రంలోని ఓ కౌలు రైతు పత్తి పంటలో అంతరపంటగా గంజాయిని సాగుచేస్తున్నాడు. సీఐ శ్రీలత తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పసుపుల చెన్నయ్య తాను కౌలుకు తీసుకున్న పొలంలో పత్తి, పసుపు పంట సాగు చేస్తుండగా అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ సీఐ శ్రీలత తన బృందంతో పంట పొలాల్లో పర్యటించి గాలించారు. చెన్నయ్య కౌలుకు వేసుకున్న పొలంలో కోత దశకు వచ్చిన గంజాయి మొక్కలను గుర్తించారు. 13గంజాయి మొక్కలను స్వాదీనం చేసుకుని, నిందితుడిని పట్టుకున్నారు. స్థానిక తాసిల్దార్ నాగరాజ్రావు సమక్షంలో బైండోవర్ చేశారు.