వికారాబాద్, జూన్ 20: విద్యార్థులు చదువుకున్న పాఠశాలకే చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడే పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి గుర్తింపును తెచ్చిన వారవుతారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని శివారెడ్డిపేట పాఠశాలలో విద్యాదినో త్స వాన్ని నిర్వహించారు. మన బస్తీ – మన బడి కింద రూ.కోటితో చేపట్టిన భవనాలను డీఈవో రేణుకాదేవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆటపాటలతో పాటు చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసు కోవాలన్నారు. ఉపాధ్యాయులు తయారు చేసిన ప్రయోగాలు(టీఎల్ఎమ్స్) ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నదన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవ త్సరం నుంచి ప్రతి రోజు విద్యార్థులకు రాగిజావ అందిస్తున్నదన్నారు. అదే విధంగా విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ ఉచితంగా అందజేస్తున్నదని తెలిపారు. డీఈవో రేణుకాదేవి మాట్లాడుతూ జిల్లాలో 371 పాఠ శాలలు మన ఊరు మన బడి కింద ఎంపిక కాగా, 200 పాఠశాలల్లో పనులు పలు దశల్లో సాగుతున్నాయన్నారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల పై ఉందన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు, 10వ తర గతిలో ఉత్త ప్రతిభను కనబర్చినందుకు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫామ్లు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, ఆర్డీవో విజయకుమారి, ఎంపీపీ చంద్రకళ, కౌన్సిలర్లు అనంత్రెడ్డి,ప్రవళిక, నర్జిన్ భేగం, పాఠశాల ప్రిన్సిపాల్ అనంత్రెడ్డి, ఎంఈవో బాబు సింగ్, ఎంపీడీవో సత్తయ్య, పట్టణ ఉపాధ్యక్షులు కడియాల వేణుగోపాల్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
బొంరాస్పేట, జూన్ 20 : ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని దీప్లానాయక్తండాలో మన ఊరు-మనబడి కార్యక్రమంలో రూ.17.40 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన పాఠశాలను, లైబ్రరీని ఆయన ప్రారం భించారు. విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు చదువు దూరం, భారం కావద్దనే సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని, ప్రైవేటు పాఠశా లలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలలను దశల వారీగా అభివృద్ధి చేయడానికి మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని, రూ.7600 కోట్లతో అన్ని పాఠ శాలలను అభివృద్ధి చేస్తామన్నారు. విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 1100 గురుకుల పాఠశాలలను ప్రారంభించారని, ఈ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.1.25 లక్షలు ఖర్చుచేసి విద్యను అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందిస్తుండగా ఈ ఏడాది నుంచి ఉచితంగా నోట్ బుక్స్ను కూడా పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. డీఆర్డీవో కృష్ణన్ మాట్లాడుతూ మన ఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో మార్పు కనిపిస్తున్నదని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా విద్యా ర్థుల డ్రాపౌట్స్, బాల్య వివాహాలు తగ్గాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, పీఏసీ ఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, ఎంఈవో రాంరెడ్డి, డీఎల్పీవో శంకర్ నాయక్, ఎంపీడీవో పాండు, సర్పంచ్ చంద్యానాయక్, ఎంపీటీసీ నర్సింహులు, హెచ్ఎం నరేందర్, బీఆర్ఎస్ నాయకులు రమణారెడ్డి, రవిగౌడ్ పాల్గొన్నారు.
వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మంగళవా రం ప్రాథమిక, జడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో విద్యా దినోత్సవాన్ని విద్యాశాఖ అధికా రులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా జరుపుకున్నారు. విద్యా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గంలోని వికారాబాద్, మోమిన్ పేట, మర్పల్లి, బంట్వారం, కోట్పల్లి, ధారూరు, నవాబుపేట మండాలల్లోని గ్రామా ల్లో ఉదయం విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. పాఠశాలకు వచ్చిన పాఠ్య పుస్తకాలు, రెండు జతల దుస్తులను ఉపాధ్యాయులు, సర్పంచ్లు, ఎంఈవోలు అందజేశారు. మరి కొన్ని పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా డిజిటల్ తరగతులను, టీఎల్ఎంలను ప్రారంభించి పరిశీలించారు.
కొడంగల్: కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల్లోని పాఠ శాలల్లో విద్యాదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కొడంగల్ పట్టణంలోని పాఠ శాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలిలో మానవహారంగా ఏర్ప డ్డారు. ఈ సందర్భంగా పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉషారాణి, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్రావు యాదవ్, ఎంఈవో రాంరెడ్డి తదితరులు మాట్లాడారు.