వికారాబాద్ : దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ పట్టణం ఆలంపల్లి నంతపద్మనాభ స్వామి దేవాయంలో నిత్యపూజలందుకుంటున్నారు. బుధవారం అనంతపద్మనాభ స్వామి సింహ వాహనంపై ఆలయ పురవీధుల్లో భక్తులు ఊరేగించారు. తాళాలు, సన్నాయిలతో స్వామివారి ఊరేగింపును భక్తులు ఘనంగా నిర్వహించారు. సింహా వాహనంపై బయలు దేరిన స్వామివారిని పట్టణ ప్రజలు పూజా కార్యక్రమాలు చేసి స్మరించుకున్నారు. ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.