పూడూరు : పత్తిని తీసుకొచ్చే రైతులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మిల్లులో అన్ని సౌకర్యాలు కల్పించాలని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పూడూరు మండల పరిధిలోని రాకంచర్ల కాటన్మిల్ను మాజీ డిప్యూటీ స్పికర్ హరీశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించి పత్తిని మిల్లుల వద్దకు తీసుకొస్తారని వారికి వ్యాపారులు మౌలిక వసతులు కల్పించాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్ కమ్లీబాయి, ఎంపీటీసీ శ్రీదేవిక, నాయకులు అజీం, శ్రీనివాస్రెడ్డి, కడ్మూర్ ఆనందం, గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ గుప్తా, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.