వికారాబాద్ : హైదరాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా ముంబై వరకు వెళ్లే హైస్పీడ్ రైలు కారిడార్ అభివృద్ధి కోసం పర్యావరణ, సామాజిక అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ గురువారం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఉదయం 11 గంటలకు ఉంటుందని తెలిపారు. హై స్పీడ్ రైలు కారిడార్ కొరకు ఏర్పాటు చేసిన ఇట్టి ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.