వికారాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు హైదరాబాద్లో బుధవారం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా వికారాబాద్ నమస్తే తెలంగాణ దిన పత్రికలో రిపోర్టర్గా పని చేసిన రవీందర్ కరోనాతో మృతి చెందాడు. ఆయన భార్య లావణ్యకు ప్రెస్ అకాడమి తరపున రూ. 2లక్షలు విలువల గల చెక్కును ప్రెస్ అకాడమి చైర్మన్తో పాటు పలువురు అందించారు.