దోమ, సెప్టెంబర్18:ప్రతి గ్రామంలో రోజుకు వంద మందికి వ్యాక్సిన్ అందించే దిశగా చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జానకీరెడ్డి అన్నారు. ఇంటింటికి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని బొంపల్లి, బాసుపల్లి, దోమ సబ్ సెంటర్లలో నిర్వహించిన వ్యాక్సినేషన్ డ్రైవ్ను శనివారం మండల ప్రత్యేక అధికారి జయ రాంతో కలిసి జిల్లా అధికారి జానకీరెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు ప్రతి గ్రామంలో వంద మందికి వ్యాక్సిన్ వేసే దిశగా లక్ష్యం పెట్టుకొని పని చేయాలని ఆయన వైద్య సిబ్బందికి సూచించారు. వ్యాక్సిన్పై ఉన్న అపోహలను దూరం చేసి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందే విధంగా కృషి చేయాలన్నారు.
వ్యాక్సినేషన్ను పరిశీలించిన ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్
కులకచర్ల, సెప్టెంబర్ 18 : కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ను డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డితో కలిసి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటమ్మ, జడ్పీటీసీ రాందాస్నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, టీఆర్ఎస్ జిల్లా నాయకులు అనిల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ, టీఆర్ఎస్ చౌడాపూర్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, వైద్య శిబ్బంది పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ వేయించుకోవాలి
పరిగి, సెప్టెంబర్ 18: 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ పేర్కొన్నారు. శనివారం పరిగి పట్టణంలోని ఆరో వార్డులో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద శాతం వ్యాక్సిన్ వేయడం పూర్తి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ నీలవేణి, కౌన్సిలర్ నాగేశ్వర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్
పరిగి టౌన్, సెప్టెంబర్ 18 : 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఖుదావంద్పూర్ గ్రామ సర్పంచ్ పరిగి గోపాల్, ఎంపీటీసీ బొంపల్లి ఉమాదేవి గ్రామస్తులకు సూచించారు. శనివారం పరిగి మండలంలోని ఖుదావంద్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శివరామకృష్ణ, వార్డు సభ్యులు కుర్వ రాములమ్మ, నల్లోల నర్సింహు లు, హెచ్ఎం మధుసూదన్, రేషన్ డీలర్ రాజు, హెల్త్ సూపర్వైజర్ చంద్రకళ, ఏఎన్ఎం లక్ష్మి పాల్గొన్నారు.
తాండూరు మండలంలో..
తాండూరు రూరల్, సెప్టెంబర్ 18 : తాండూరు మండలంలో వ్యాక్సినేషన్ జోరుగా సాగు తున్నది. మండలంలోని 9 సబ్సెంటర్ల పరిధిలోని ఆయా గ్రామాల్లో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు కొవిడ్ టీకా వేస్తున్నారు. 18 ఏండ్లు నిండిన వారు టీకా వేసుకోవాలంటూ ఆయా గ్రామాల సర్పంచ్లు డప్పుతో చాటింపు వేయిస్తున్నారు. శనివారం మండలంలోని చెంగోల్ గ్రామ సర్పంచ్ మల్లేశ్వరీగౌడ్ పంచాయతీ కార్యాలయంలో టీకా వేయించుకున్నారు
కొడంగల్లో ముమ్మరంగా ..
కొడంగల్, సెప్టెంబర్ 18 : కరోనా కట్టడిలో భాగంగా ఇంటింటి సర్వేతో పాటు ఇంటి వద్దే టీకాలు అందించే కార్యక్రమం మున్సిపల్, గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగుతున్నట్లు ఇన్చార్జి తహసీల్దార్ ఆనంద్ తెలిపారు. శనివారం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో నిర్వహిస్తున్న సర్వే, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్యాదవ్, మున్సిపల్ కమిషనర్ నాగరాజుతో పాటు ఆయా వార్డుల ప్రత్యేకాధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
మర్పల్లిలో 917 మందికి వ్యాక్సినేషన్
మర్పల్లి, సెప్టెంబర్ 18 : మర్పల్లిలో 917 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఎంపీడీవో వెంక ట్రామ్గౌడ్ తెలిపారు. శనివారం మండలంలోని కల్ఖోడా, షాపూర్, బూచన్పల్లి తదితర గ్రామాల్లోని వ్యాక్సిన్ సెంటర్లను మండల ప్రత్యేకాధికారిణి అనితతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 10 సెంటర్లలో 917 మందికి వ్యాక్సిన్ వేశారన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేలా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశ వర్కర్లు సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో సోమలింగం, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్, రవికుమార్, స్వప్న, జనార్ధన్ పాల్గొన్నారు.
ధారురులో 931 మందికి వ్యాక్సిన్
ధారూరు, సెప్టెంబర్ 18: మండల పరిధిలోని 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ధారూరు, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు రాజు, రమేశ్బాబు తెలిపారు. ధారూరు ప్రాథమిక ఆరోగ్య పరిధిలోని ధారూరు పీహెచ్సీతో పాటు నాలుగు సబ్ సెంటర్లలో 420 మంది వ్యాక్సిన్, నాగసముందర్ పరిధిలోని నాలుగు సెంటర్లలో మొత్తం 511మంది వ్యాక్సిన్ వేశామని ధారూరు, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు రాజు, రమేశ్బాబు తెలిపారు.
పెద్దేముల్లో..
పెద్దేముల్, సెప్టెంబర్ 18 : కరోనా వ్యాక్సిన్ను ప్రతి ఒక్కరు తప్పకుండా వేయించుకోవాలని మారేపల్లి సర్పంచ్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు పి.బల్వంత్ రెడ్డి అన్నారు.శనివారం మండల పరిధిలోని మారేపల్లి గ్రామంలో నూతనంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను స్థానిక నాయ కులు,వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి భోజ్యానాయక్,వీఆర్ఏ సమీర్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలి
బంట్వారం, సెప్టెంబర్ 18 : కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ చేయాలని ఎంపీడీవో బాలయ్య పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని తొరుమామిడి గ్రామంలో నిర్వహిస్తున్న వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనాను నియంత్రించాలంటే వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.