బషీరాబాద్ : తాండూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్వప్న మంగళవారం మండలానికి సంబంధించిన రెండు కేసుల్లో తీర్పు ఇవ్వడం జరిగిందని బషీరాబాద్ ఎస్సై విద్యాచర్రెడ్డి తెలిపారు. 2016 సంవత్సరంలో అక్రమ ఇసుక కేసులో ఆరు మందికి ఒక్కోక్కరికి చొప్పున మూడు నెలల జైలు శిక్ష లేదా రూ. 1000 జరిమానా, ఇద్దరికీ మూడు నెలల జైలు శిక్ష లేదా రూ. 500 జరిమానా, అదే సంవత్సరం జరిగిన ఒక గొడవలో కొట్టుకున్న ఎనిమిది మందికి గాను ఒక్కొక్కరికి రూ. 500 జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష, అని కోర్టు తీర్పు ఇవ్వడంతో శిక్ష పడిన వారు అందరూ మెజిస్ట్రేట్ తీర్పు మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో 16 మంది జరిమానా చెల్లించినట్లు ఎస్సై పేర్కొన్నారు.