కడ్తాల్, మార్చి 22: మండల పరిధిలోని రావిచేడ్ గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం నిత్యపూజ కార్యక్రమం, పారాయణం, అర్చనలు, హోమాలు, అమ్మవార్లకు కుంకుమార్చన చేశారు. అనంతరం దేవతామూర్తుల విగ్రహాలకు పూజలు చేసి పల్లకీసేవలో గ్రామంలో ఊరేగించారు.
కార్యక్రమంలో ఎంపీటీసీ గోపాల్, మాజీ ఉప సర్పంచ్ వెంకటేశ్, ఆలయ అనువంశిక ధర్మకర్త రామచందర్రావు, క్రాంతికుమార్, ఆలయ అర్చకులు శ్రీమాన్ తిరుమల వింజమూరి రామానుజాచార్యులు, శ్రీమాన్ ఆచార్య ఆదిత్య, చిదంబరశర్మ, శిరీశ్కుమార్, ఆలయ నిర్వాహకులు రంగయ్య, శ్రీనివాస్, యాదయ్య, పవన్, మల్లేశ్, లింగం, రమేశ్, రాజు, రవి, పారేశ, రామచంద్రయ్య, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.