రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు, సిబ్బంది పాల్గొని జాతీయ జెండాను వారివారి కార్యాలయాల్లో ఎగురవేసి జెండాకు వందనం చేశారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాల తీరును కొనియాడారు. పలు చోట్ల విద్యార్థులకు నోటుపుస్తకాలను పంపిణీ చేశారు.
అలాగే, ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మరికొన్ని చోట్ల ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు.
– న్యూస్నెట్ వర్క్, ఆగస్టు 15, నమస్తే తెలంగాణ