షాద్నగర్టౌన్, జనవరి30: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కారాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన గాంధీ చిత్ర పటానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శాంతి, అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టిన మహాత్ముడు గాంధీజీ అని అన్నారు.
అహింసా ఉద్యమం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. అదేవిధంగా పట్టణంలోని మున్సిపల్ గంజ్లోని గాంధీ విగ్రహానికి పూలమాలేసి కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ చైర్మన్ నరేందర్ నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు బాబర్ఖాజ్, బస్వం, బాల్రాజ్, మురళీమోహన్, విజయ్కుమార్, శ్రీకాంత్రెడ్డి, కృష్ణారెడ్డి, అశోక్ పాల్గొన్నారు. కౌన్సిలర్లు అంతయ్య, సలేంద్రం రాజేశ్వర్, శ్రీనివాస్, నందీశ్వర్, ప్రతాప్రెడ్డి, నాయకులు గోపాల్, జూపల్లి శంకర్, శేఖర్, శ్రీశైలం, ఏజాజ్, సుధీర్, ప్రదీప్కుమార్, ప్రభాకర్ పాల్గొన్నారు.
గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేయాలి
కడ్తాల్ : జాతిపిత మహాత్మాగాంధీ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో గాంధీజీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు జహంగీర్బాబా, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్, ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షుడు గంప శ్రీను, నాయకులు భాస్కర్రెడ్డి, హన్మానాయక్, లక్ష్మయ్య, రాములుయాదవ్, మల్లయ్య, సత్యంయాదవ్, జహంగీర్అలీ, రామచందర్నాయక్, రాముగుప్తా, వీరేంద్రగుప్తా, చంద్రయ్య, మోహన్, వెంకటేశ్, సత్యనారాయణ, వీరేశ్, రాజశేఖర్, రఘు, యాద య్య, రాజేశ్, రాజేందర్, ఇమ్రాన్, రవి, మహేశ్ పాల్గొన్నారు.
మహాత్ముడి మార్గం అనుసరణీయం
ఆమనగల్లు : మహాత్ముడి మార్గం అనుసరణీయమని సీఐ జే. వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం పట్టణంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వీరబొమ్మ రామ్మోహన్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ బలరాంనాయక్లు విచ్చేసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ మాట్లాడుతూ తరాలు.. యుగాలు గడిచినా జాతిపిత మహాత్మాగాంధీ జీవనం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం నాయకులు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉప అధ్యక్షుడు పాపిశెట్టి రాము, ఆర్యవైశ్య సంఘం నాయకులు కండె సాయి, చంద్రశేఖర్, యాదయ్య, రాజు, శ్రీనివాస్, నర్సింహ, మల్లేశ్, శ్రీను, పురేందర్, సురేశ్, సుధాకర్, రమేశ్, యాదగిరి, విష్ణువర్దన్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.