నిజామాబాద్ జిల్లాలో మెడిసిన్ చదువుతున్న దాసరి హర్ష(22) ఆత్మహత్యతో ఆయన స్వగ్రామమైన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం రాత్రి తల్లి రాధతో హర్ష ఫోన్లో మాట్లాడాడు. ‘అమ్మా.. నాకు మళ్లీ బ్యాక్ పెయిన్ వచ్చింది. హాస్పిటల్లో స్కానింగ్ తీయించా.. మందులు ఇచ్చారు.. తగ్గుతుందిలే.. నువ్వేం దిగులు పడకు..’ నన్ను రమ్మంటావా బిడ్డా అని రాధమ్మ అడగ్గా.. ‘నాలుగు రోజుల్లో పరీక్షలు పూర్తవుతాయి. నేనే వస్తా అమ్మా.. హైదరాబాద్ పోయి చూపించుకుందాం. డబ్బులు ఏర్పాటు చేయూ.. డబ్బులకు భయపడకు, నేను డాక్టర్ అయ్యాక అన్ని తీరుస్తా..’ అంటూ ధైర్యం చెప్పిన హర్ష.. తెల్లారే సరికి ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్ వచ్చిందంటూ ఆ తల్లి బోరున విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
– మంచిర్యాల(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దండేపల్లి, ఫిబ్రవరి 25
మంచిర్యాల(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దండేప ల్లి, ఫిబ్రవరి 25: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన దా సరి శ్రీనివాస్-రాధ దంపతులకు ఇద్దరు కొడుకు లు. హర్ష పెద్దవాడు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. చిన్న కుమారుడు ధనూష్ హైదరాబాద్లో డిగ్రీ చే స్తున్నాడు. హర్ష తండ్రి శ్రీనివాస్ మలేషియాలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కరోనా సమయంలో ఇంటికి వచ్చిన ఆయన మూడు నెలల క్రితమే తిరిగి మలేషియా వెళ్లాడారు. ఉన్న ఎకరం పొలంతో ఏం చేయలేక పిల్లలనైనా మంచిగ చదివించాలనే ఉద్దేశం తో వలసపోయి పని చేసి డబ్బులు పంపేవాడు. దానికి తోడు రాధమ్మ కూడా బీడీ కార్మికురాలిగా పని చేస్తూ ఇంట్లో ఖర్చులు వెళ్లదీసేది. చిన్నప్పటి నుంచి హర్ష బాగా చదువుకునేటోడు.
నేను డాక్టర్ అయ్యాక మా తల్లిదండ్రుల కష్టాలన్ని తీరుస్తా అని స్నేహితుల కు చెప్పేవాడు. ఐదో తరగతి వరకు జన్నారం మండలంలోని జయరాణి స్కూల్లో చదువుకున్నాడు. అ నంతరం మం చిర్యాలలో శ్రీ చైతన్య స్కూల్లో పదో తరగతి పూర్తి చేశారు. 10/10 జీపీఏ సాధించాడు. అనంతరం ఇంటర్మీడియెట్ హైదరాబాద్లోని శ్రీచైతన్య కాలేజీలో చదివాడు. ఇంటర్ బైపీసీలో హర్ష కాలేజీ టాపర్లలో ఒకరు. ఎంబీబీఎస్ సీటు కూడా తొలి ప్రయత్నంలోనే వచ్చింది.
రెండేళ్లుగా బ్యాక్ పెయిన్ సమస్య
హర్షకు బ్యాక్ పెయిన్ సమస్య రెండేళ్లుగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఏడాది క్రితం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపిస్తే నొప్పికి మందులు రాశారు. అవి వాడితే నొప్పి తగ్గింది. మళ్లీ నాలుగు రోజుల క్రితం నొప్పి మొదలైందని హర్ష ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. మొన్న ఎంఆర్ఐ స్కాన్ తీయించుకున్నాడు. మందులు కూడా వాడుతున్నా డు. శనివారం(ఇవాళ) న్యూరాలజిస్ట్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాడు. శుక్రవారం సాయత్రం 6.30 గంటలకు అమ్మతో మాట్లాడిండు. రాత్రి 8.30 గంటలకు హర్ష గదికి హాస్టల్లో ఎదురు రూ మ్లో ఉండే చతుర్వేది వచ్చి చూడగా ఏడిచినట్లు కనిపించాడు. ఏం అయ్యింది హర్ష అని ఆరా తీయగా ఏం కాలేదు.. నువ్వు వెళ్లు. నేను చదువుకోవాలి. అని చెప్పాడు.
అనంతరం చతుర్వేది రాత్రి 11.30 గంటల సమయంలో ఉదయం మూడు గంటలకు నువ్వు లేచినప్పుడు నన్ను నిద్రలేపు హర్ష అని మె స్సేజ్ చేసినా సమాధానం రాలేదు. పడుకొని ఉం డొచ్చు అని ఫ్రెండ్ భావించాడు. ఉదయం 3 గంటలకు లేచి చూడగా రూమ్లో లైట్ వేసి ఉంది. లేచి చదువుకుంటున్నట్లు ఉందని స్నేహితులు భావించారు. 7.30 గంటలకు టిఫిన్ చేసేందుకు వెళ్లే సమయంలో చూడగా రూమ్ తలుపు మూసే ఉంది. ఎంత కొట్టినా హర్ష తీయలేదు. గది కిటికిలో నుంచి చూడగా ఉరి వేసుకొని కనిపించాడు. ఇది సార్ జరిగిదం టూ హర్ష బంధువులు ‘నమస్తే తెలంగాణ’తో మా ట్లాడుతూ చెప్పారు. శనివారం రాత్రి 8 గంటలకు హర్ష మృతదేహం స్వగ్రామానికి చేరనుంది. ఆదివా రం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తామని బం ధువులు తెలిపారు. హర్షను చివరి చూపు చూసేందుకు గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు ఇంటి దగ్గరకు చేరుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో డాక్టర్ అయితడు అనుకున్న పిల్లోడు ఆత్మహత్య చేసుకోవడంతో చింతగూడలో విషాదఛాయలు అలముకున్నాయి.