నందిగామ : గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు పెట్టిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ దుండగులు ఎత్తుకెళ్లిన సంఘన నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రంగాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన చెత్త ట్రాక్టర్ను డ్రైవర్ కావాలి సాంబయ్య గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో చెత్త సేకరించి రోజు మాదిరిగానే సాయంత్రం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో పెట్టి ఇంటికి వెళ్లిపోయాడు.
తిరిగి శుక్రవారం ఉదయం వచ్చిచూడగా ట్రాక్టర్ కనిపించకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి బాల్రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నందిగామ సీఐ రామయ్య తెలిపారు.