Yoga | షాద్నగర్ రూరల్, జూన్ 20 : నేటి సమాజంలో కల్తీ, కలుషిత ఆహారాన్ని భుజించడంతో చిన్నతనం నుంచే వివిధ రోగాలు వ్యాపిస్తున్నాయి. షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. రోజురోజుకూ మానవ జీవిత కాలం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. దీనికి గాను ప్రతి ఒక్కరూ తప్పకుండా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ అనునిత్యం యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని పలువురు సూచిస్తున్నారు.
సకల రోగాల నివారిణి యోగా
షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక, ఎన్నో ప్రాణాంతక వ్యాధులు, మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కేవలం ప్రతి రోజూ కనీసం గంట సమయం యోగా చేస్తే ఎలాంటి రుగ్మతలు వ్యాపించవని యోగా శిక్షకులు చెబుతున్నారు. యోగా చేయడం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్య సమస్యలు ఉండవని, ఏకాగ్రతతో యోగా చేస్తే ఆరోగ్యం, మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది.
యోగా ఇలా..
యోగాలో అనులోమం, విలోమం చేయడంతో ఊపిరితిత్తులు మెరుగుగా పనిచేస్తాయి. అదేవిధంగా శరీరంలో బీపీ, షుగర్ను తగ్గిస్తుంది. శ్వాస కోశ వ్యాధులను దూరం చేస్తున్నది. యోగాలో కపాలిబాత్, బ్రహ్మణి, సూర్యబేద, చంద్రబేద, బాస్తీక, శీతల్, ఉజయి, ఉద్గీత్, బాహ్య చేయడంతో మనం ఆరోగ్యంగా జీవించవచ్చు. అందుకే నేడు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు యోగాను చేస్తున్నారు.
ఇవేకాకుండా అనేక ఆసనాలు వేసేందుకు యోగా గురువుల సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పరిపూర్ణమైన ఆరోగ్యం పొందాలంటే యోగా అవసరమని, ధీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉండాలంటే యోగా తప్పనిసరిగా నిత్యజీవితంలో భాగం కావాల్సిందేనని చెబుతున్నారు.
కఠిన ఆసనాల జోలికి వెళ్లొద్దు
యోగా అభ్యాసనం ఎప్పుడూ ప్రకృతికి దగ్గరగా ఉండడం ద్వారా మంచి ఫలితాలనిస్తుంది. ఎంచుకున్న స్థలం ఎత్తు పళ్లాలు లేకుండా సమాంతరంగా ఉండాలి. స్థిరంగా ఒక భంగిమలో కూర్చోవాలి. మంచి వాతావరణం, వెలుతురు, గాలి వచ్చేలా ఉన్న స్థలాన్ని ఎంచుకోవాలి. శక్తికి మించిన వ్యాయమాలు చేయకుండా కొద్ది కొద్దిగా సాధన చేస్తూ ఉండాలి.
యోగాతో మానసిక ప్రశాంతత
యోగా మనలోని బద్దకాన్ని తొలగిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది. ప్రతిరోజూ యోగా చేస్తున్నా. యోగాతో మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఆరోగ్యం, ఏకాగ్రత, మంచి వ్యక్తిత్వ నిర్మాణం, శాంతియుత స్వభావంతో ఉండగలుగుతాం.
రుగ్మతల నివారణకు యోగా..
రుగ్మతల నివారణకు యోగా దివ్య ఔషధంలా పనిచేస్తుంది. నేను యోగా గురువు రాందేవ్ బాబా వద్ద శిక్షణ తీసుకున్నా. షాద్నగర్ పట్టణంలో ప్రస్తుతం 7 యోగా శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్నా. ఎంతో మంది బీపీ, షుగర్, వివిధ వ్యాధుల వల్ల బాధపడిన వారికి యోగాతో నయం అవుతుంది. ప్రతి ఒక్కరూ యోగాను అనునిత్యం చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చ. మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తున్నది. ఉచితంగా కాలనీల్లో యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. యోగాతో నా ఆరోగ్య సమస్య తీరింది. కొంత కాలం క్రితం డిస్క్ సమస్యతో ఎంతో బాధపడ్డాను. యోగా ప్రయోజనాలను తెలుసుకొని పతాంజలి యోగా శిక్షణ కేంద్రానికి వెళ్లి యోగా చేశా. నా ఆరోగ్య సమస్య తీరింది. నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా. అనునిత్యం యోగా చేస్తున్నా.
–పానుగంటి శశిధర్, యోగా గురువు