క్రిస్మస్ పర్వదినానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చర్చిలు సిద్ధమయ్యాయి. చర్చిల ప్రాంగణాలు, పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో నిర్వాహకులు సుందరంగా అలంకరించారు. ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపే పశువుల పాక, క్రిస్మస్ ట్రీ, స్టార్స్తో చర్చిలకు కొత్త శోభ వచ్చింది.
క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకొనేందుకు ఉమ్మడి జిల్లాలోని క్రైస్తవులు సిద్ధమయ్యారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని చర్చిలు, ప్రార్థనా మందిరాలను నిర్వాహకులు అందంగా ముస్తాబు చేశారు. క్రిస్మస్ ట్రీలు, స్టార్లతో అలంకరించారు. విద్యుత్దీపాల వెలుగుల్లో చర్చిలు ధగధగలాడుతున్నాయి.
-న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ
వికారాబాద్, డిసెంబర్ 24: రాష్ట్ర ప్ర భుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల పం డుగలను అధికారికంగా నిర్వహించి గిఫ్టు లు అందిస్తున్నదని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశం హాలులో జిల్లా మైనార్టీ సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని అధికారులతో కలిసి కేక్ కట్ చేశా రు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ఏసుక్రీస్తు గొప్ప శాంతిదూత అని, ఆయన కేవలం క్రైస్తవులకు మాత్రమే చెందిన వా రు కాదన్నారు. కుల, మతాల్లో శాంతి స్థాపన కోసం పుట్టిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన చూపిన శాంతిమార్గంలో అందరూ పయనించి సోదరభావంతో జీవించాలన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు క్రైస్తవులు భక్తి పాటలు పాడా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్కుమా ర్, డీఆర్డీవో కృష్ణన్, వికారాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి విజయకుమారి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, అధికారులు, సిబ్బం ది పాల్గొన్నారు.