షాబాద్, ఫిబ్రవరి 24: ప్రజల కంటి సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండోవిడుత కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. 80వైద్య బృందాల సభ్యులు తమ కు కేటాయించిన గ్రామాల్లో కంటి వెలుగు క్యాం పులను ఏర్పాటు చేసి ప్రజలకు పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులతోపాటు కంటి అద్దాలను పంపిణీ చేస్తుండటంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. శుక్రవారం జిల్లాలో ని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంప ల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో 15,726 మందికి కంటి పరీక్షలు నిర్వహించిన్న ట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. అం దులో 1,434 మందికి వైద్యులు కంటి అద్దాలు అందజేయగా..1,156 మందికి ప్రిస్కిప్షన్ అద్దా ల కోసం ఆర్డర్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కంటి వెలుగు కేంద్రాలను సందర్శించి వైద్యసిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. శుక్రవారానికి ఈ కార్యక్రమం 26వ రోజుకు చేరింది.
బొంరాస్పేట : అంధత్వం, కంటి జబ్బుల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్నది. నేత్ర సం బంధిత వ్యాధులతో వచ్చిన వారికి కంటి వెలుగు శిబిరాల్లోని వైద్య సిబ్బంది ఉచితంగా కంటి పరీక్షలు చేసి మందులు, అద్దాలను అందిస్తున్నారు. ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. శుక్రవారం జిల్లాలో 5,245 మం దికి వైద్యులు కంటి పరీక్షలు చేయగా.. అందులో 769 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. 661 మందికి ప్రిస్కిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటివరకు 144 గ్రామాలు, 34 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
గ్రామాలకే వైద్యసిబ్బంది వచ్చి ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు, మందులను పంపిణీ చేయడం చాలా సం తోషంగా ఉన్నది. కం డ్ల సమస్యల్లేకుండా పేదలు ఉండాలనే ఉద్దే శంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమా న్ని ప్రవేశపెట్టి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. ఈ సందర్భంగా సీఎం సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
-నర్సింహులు, తంగడిపల్లి, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా