వికారాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దళారుల బారిన పడి పత్తి రైతులు మోసపోకుండా ప్రభుత్వమే సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 13 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 9 కేంద్రాల్లో పత్తిని సేకరిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే కనీస మద్దతు ధర కూడా పెరిగింది. గతేడాది క్వింటాలు పత్తికి రూ.6300 ఉండగా, ఈ ఏడాది 7020లుగా నిర్ణయించారు. అదేవిధంగా ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల్లోనూ క్వింటాలుకు రూ.6900ల నుంచి రూ.7100 వరకు చెల్లిస్తున్నారు.
జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ ఏడాది 2.80 లక్షల క్వింటాళ్ల పత్తిని సేకరించడమే లక్ష్యంగా పెట్టుకోగా, 17,776 క్వింటాళ్ల పత్తిని సేకరించారు. మూడు రోజుల్లోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నారు. ఇప్పటివరకు రూ.4.64 కోట్లను పత్తి రైతులకు చెల్లించినట్లు జిల్లాయంత్రాంగం పేర్కొన్నది. జిల్లాలో ఈ ఏడాది 2.45 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది.
– వికారాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : పత్తి సాగు చేసిన ప్రతి రైతుకూ కనీస మద్దతు ధర అందేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందు కోసం దళారుల బారిన పడి పత్తి రైతులు మోసపోకుండా ప్రభుత్వమే సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారి నుం చి పత్తిని సేకరిస్తున్నది. జిల్లాలో పత్తిని కొనుగోలు చేస్తున్న జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలతోపాటు ప్రైవేట్ కేంద్రాలను కూడా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పత్తిలో తేమ శా తాన్ని బట్టి సీసీఐ రైతుల నుంచి పత్తిని సేకరిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 13 పత్తి కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగం.. ప్రస్తుతం 9 కొనుగోలు కేంద్రాల్లో పత్తి సేకరణ ప్రక్రియ షురూ అయింది. మరో నాలుగు కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రస్తుతం రైతులు పత్తి ఏరుతున్న నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో సంబంధిత కొ నుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. గతేడాదితో పోలిస్తే కనీస మద్దతు ధర కూడా పెరిగింది. గతేడాది సీసీఐ ఆధ్వర్యం లో కొనుగోలు చేసిన పత్తి క్వింటాల్కు రూ.6300గా నిర్ణయించగా, ఈ ఏడాది రూ.7020గా నిర్ణయించారు. ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్కు రూ.6900 నుంచి రూ.7100 లకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది గతంలో ఎన్నడూలేని విధంగా జిల్లా రైతాంగం పత్తిని సాగు చేసిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు భారీగా వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పత్తిని విక్రయించిన రైతులకు మూడు రోజుల్లోగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నారు. ఇప్పటివరకు రైతులు విక్రయించిన పత్తికి రూ.4.64 కోట్లు చెల్లించినట్లు సంబంధిత అధికారి వెల్లడించారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 2.45 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశా రు. అత్యధికంగా వికారాబాద్ డివిజన్లో సాగు చేశారు.
బొంరాస్పేట మండలంలో 3,750 ఎకరాలు, దౌల్తాబాద్లో 12,986 ఎకరాలు, కొడంగల్లో 28,100 ఎకరాలు, చౌడాపూర్లో 670 ఎకరాలు, దోమలో 2,661 ఎకరాలు, కులుకచర్లలో 565ఎకరాలు, పరిగిలో 18,520 ఎకరాలు, పూడూరులో 24,902 ఎకరాలు, బషీరాబాద్లో 9160 ఎకరాలు, పెద్దేముల్లో 14,068 ఎకరాలు, తాండూరులో 4961 ఎకరాలు, యాలాలలో 10,007 ఎకరాలు, బంట్వారంలో 9,910 ఎకరాలు, ధారూరులో 14,090 ఎకరాలు, కోట్పల్లిలో 14,565 ఎకరాలు, మర్పల్లిలో 19,891 ఎకరాలు, మోమిన్పేటలో 20,631 ఎకరాలు, నవాబుపేటలో 18,500 ఎకరాలు, వికారాబాద్ మండలంలో 17,284 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు.
ప్రస్తుతం జిల్లా అంతటా పత్తి కొనుగోళ్లు జోరందుకున్నాయి. ప్రతి ఏటా నవంబర్ చివరి వారంలోగా రైతులు పత్తిని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది కూడా ముందుగానే పత్తి కొనుగోలు కేంద్రాలను జిల్లా మార్కెటింగ్ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. పత్తిని రైతుల నుంచి సేకరించేందుకు జిల్లావ్యాప్తంగా 13 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తాండూరులో మారుతి, శుభం, బాలాజీ కొనుగోలు కేంద్రాలు, కోట్పల్లిలో సాయిబాబా కాటన్ అగ్రో ఇండస్ట్రిస్, పరిగిలో లక్ష్మీవెంకటేశ్వర, నరసింహ, రాకంచర్ల కాటన్మిల్, వికారాబాద్లో ధరణి, సాయిబాబా, అయ్యప్ప జిన్నింగ్ మిల్లులో, మర్పల్లిలో శ్రీఅయ్యప్ప కాటన్ ట్రేడర్స్, కొడంగల్లో విజయ్ ఇండస్ట్రిస్ జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలతోపాటు ప్రైవేట్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది జిల్లా అంతటా పెద్ద మొత్తంలో జిల్లా రైతాంగం పత్తి పంటను సాగు చేసిన నేపథ్యంలో భారీగా పత్తి కొనుగోలు కేంద్రాలకు వస్తుందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది 2.80 లక్షల క్వింటాళ్ల పత్తిని సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు. ఇప్పటివరకు 17,776 క్వింటాళ్ల పత్తిని రైతుల నుంచి సేకరించారు. అత్యధికంగా తాండూరులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 11,801 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. కొడంగల్లో 4,086 క్వింటాళ్లు, వికారాబాద్లో 375 క్వింటాళ్లు, కోట్పల్లిలో 1,458 క్వింటాళ్లు, ధారూర్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా 53.7 క్వింటాళ్ల పత్తిని రైతుల నుంచి సేకరించారు.