తలకొండపల్లి : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేజ్-2 కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ విజయవంతం అయ్యింది. తలకొండపల్లి మండలంలోని వేంకటేశ్వర ఫంక్షన్ హాల్లో కలెక్టర్ అమయ్కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పలువురు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలియజేస్తూ విలైనంత తొందరగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి రైతులకు ప్రజలకు సాగు, తాగునీరు ఇవ్వాలని కోరారు. తలకొండపల్లి, ఆమనగల్లు, కడ్తాల మండలాలకు చెందిన రైతులు ఎన్నో ఎండ్లుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని నియోజకవర్గానికి చెందిన రైతులు భూగర్భ జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేసేకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. సముద్రమట్టానికి ఎత్తు ప్రాంతంలో ఉన్న కల్వకుర్తి, షాద్నగర్ నియోజకవర్గాలకు ప్రాజెక్టు ఒక్కటే శరణ్యమని అన్నారు.
ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని రైతులు తమ ప్రాంతంలో పర్యవరణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తామంతా ప్రాజెక్టు నిర్మాణానికి మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. వివిధ గ్రామాలకు చెందిన 33మంది రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రైతులు తెలిపిన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి అందజేసి పర్యావరణ అనుమతులు పొందేలా నివేదికలు పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు ఈఈ వెంకన్న, ఇరిగేషన్ ఎస్ఈ సత్యనారాయణ, కందుకూరు ఆర్డిఓ వెంకటాచారి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిదులు, రైతులు ప్రజలు పాల్గొన్నారు.