యాచారం, ఫిబ్రవరి 6: మండలంలో కొనసాగుతున్న కంటివెలుగు శిబిరాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. సోమవారం మండలంలోని గున్గల్లో 123 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 15 మందికి సమస్యలున్నట్లు గుర్తించారు. 20 మందికి అద్దాలు అందజేశారు. యాచారంలో 118 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 9 మందికి కాట్రాక్టు ఉన్నట్లు గుర్తించారు. 14 మందికి అద్దాలను అందజేశారు. గున్గల్ కంటివెలుగు శిబిరాన్ని ఎంపీడీవో విజయలక్ష్మి పరిశీలించారు. కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్యాధికారి ప్రియాంక, వైద్యులు స్వరాజ్యలక్ష్మి, మౌనిక, హెచ్ఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
కడ్తాల్ : కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని గాన్గుమార్లతండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్యులు అత్యాధునిక పరికరాల సహాయంతో చేస్తున్న కంటి పరీక్షలను వారు పరిశీలించారు. దృష్టి లోపంతో బాధపడుతున్న వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అద్దాలు అందజేయడంతోపాటు అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ హంశ్యామోత్యానాయక్, ఉప సర్పంచ్ శారద, పీఏసీఎస్ డైరెక్టర్ సేవ్యానాయక్, నాయకులు పాండు, శ్రీను, శంకర్, లక్ష్మణ్, లక్ష్మి, సూర్య, లక్పతీనాయక్, రాజు, కిషన్, వినోద్, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, వైద్యాధికారులు కిరణ్కుమార్, సంపూర్ణదేవి, హెచ్ఈవో సుధీర్బాబు, హెల్త్ సూపర్వైజర్ ఎల్లమ్మ, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : మండల పరిధిలోని కౌకుంట్ల, ఆలూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన రెండు విడుత కంటి వెలుగు శిబిరాలకు మంచి స్పందన లభిస్తున్నది. వచ్చిన వారికి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు, మందులు అందజేస్తున్నారు.
శంకర్పల్లి : అలాంఖాన్గూడ గ్రామంలో జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ గోవర్ధన్రెడ్డి పరీశీలించి,లబ్ధిదారులకు అద్దాలను పంపిణీ చేశారు. శిబిరాని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మౌనిక, నాయకులు నరేందర్రెడ్డి, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.