రంగారెడ్డి, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఓటర్ జాబితాను పకడ్బందీగా రూపొందించాలని రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రోరల్ పరిశీలకురాలు వాణీప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ అమయ్కుమార్తో కలిసి వాణీప్రసాద్ ఎస్ఎస్ఆర్-2023కు సంబంధించి ఓటరు జాబితా లో సవరణలు, మార్పులు, చేర్పులు, తొలగింపులు తదితర అంశాలపై ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఎల్వోలు ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి చనిపోయిన వారి వివరాలు, మరణ ధ్రువీకరణ, ఇతర వివరాలను సంబంధిత కుటుంబం నుంచి లేదా గ్రామ పం చాయతీ నుంచి గానీ సేకరించాలన్నా రు. తొలగింపులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫారం-7కు సం బంధించి నోటీసులు ఇవ్వాలని, విచారణ చేసి ధ్రువీకరించు కోవాలన్నారు. తిరస్కరిస్తే అందుకు గల సరైన కారణాలను తెలపాలన్నారు. అనంతరం కలెక్టర్ అమయ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఫారం 6, 7, 8లకు సంబంధించి దాదాపు 95 శాతం దరఖాస్తుల ను పరిశీలించామని, 90 శాతం అప్డే ట్ చేశామని తెలిపారు. రెండు రోజుల్లో గా అన్ని దరఖాస్తులను క్లియర్ చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు తిరుపతిరావు, ప్రతీక్ జైన్, డీఆర్వో హరిప్రియ, జడ్పీసీఈవో దిలీప్కుమార్, డీఆర్డీఏ ప్రభాకర్, ఆర్డీవోలు వెంకటాచారి, రాజేశ్వరి, వేణుగోపాల్, ఏఈఆర్వోలు, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
వచ్చేనెల 5 వరకు తుది జాబితాను సిద్ధం చేయాలి
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో ఓటర్ జాబితాను పకడ్బందీగా రూ పొందించాలని జిల్లా ఎలక్ట్రోరల్ పరిశీలకురాలు వాణీప్రసాద్ సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవా రం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ నిఖిలతో కలిసి ఓటర్ నమోదు, ఓటర్ జాబితా రూపకల్పనను పరిశీలించారు. ఈ సందర్భంగా వాణీప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో నూతన ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తప్పుల్లేకుండా ఓటర్ జాబితా ను రూపొందించాలన్నారు. డిసెంబర్ 26లోపు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. జనవరి 5 తేదీ లోపు తుది జాబితాను సిద్ధం చేయాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.