పహాడీషరీఫ్, ఏప్రిల్ 15 : ఉద్యోగం కోసం వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై అజయ్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలోని జల్పల్లిలో నివాసముంటున్న మహ్మద్ అస్గర్(40) వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. చెన్నెలోని ఎక్స్ఎల్ బీపీఓ కంపెనీలో ఉద్యోగం దొరికందని వెళ్లి 15 రోజులలో తిరిగి వస్తానని ఫిబ్రవరి 5న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కానీ ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వస్తోంది. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా అతని ఆచూకీ లభించలేదు. బావమరిది మహ్మద్ అలీ ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.