మర్పల్లి, మే 5: మొగిలిగుండ్ల గ్రామం లో నూతనంగా నిర్మించిన మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్య క్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం చండీయాగం, మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. మహిళలు బోనాలను అందంగా ముస్తాబు చేసి ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మ వారికి సమర్పించి మొక్కులు తీర్చుకు న్నారు. ఎమ్మెల్యే ఆనంద్ మండల నాయకులతో కలిసి ఆయా గ్రామాల ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు.
కార్యక్రమంలో మండల ప్రజా ప్రతి నిధులు, గ్రామాల సర్పంచులు, ఎంపీ టీసీలు పాల్గొన్నారు. అలాగే మండల పరిధిలోని సిరిపురంలో భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి జాతర ఘనంగా జరిగింది . శుక్రవారం ఉద యం వేద పండి తులు స్వామివారికి అభిషేకం, నందిగోల, అగ్గిగుండం, స్వామివారి కల్యా ణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాత్రికి ఆలయం చుట్టూ రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు.