కడ్తాల్, జవనరి 5 : ప్రజల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన గోపాల్కిషన్కు రూ.60 వేలు, తలకొండపల్లి మండలానికి చెందిన కృష్ణయ్యకు రూ.15 వేలు, వెల్దండ మండలానికి చెందిన వెంకటయ్యకు రూ.28 వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరయ్యాయి.
గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్సీ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ఏదో ఒక రూపంలో ప్రతి ఇంటికి చేరుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీలు కమ్లీమోత్యానాయక్, అనిత, సర్పంచ్ భారతమ్మ, పీఏసీఎస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, నాయకులు విజయ్, విఠలయ్య, రఘురాములు, రంగయ్య, రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని ముర్తుజపల్లికి చెందిన బైకని అంజమ్మకు రూ.20 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఆ చెక్కును బాధిత కుటుంబ సభ్యుడికి గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో అందజేశారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, నాయకులు నిట్టనారాయణ, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.