వికారాబాద్, ఫిబ్రవరి 1 : జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచే దిశగా తీసుకెళ్లాలని కలెక్టర్ నిఖిల ఎన్నికల అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో యంత్రాంగం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సహకారం మరువలేనిదని తెలిపారు. జిల్లాలో క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాట్లలో జిల్లా ముందంజలో ఉండడం అధికారుల కృషి ఫలితమని గుర్తు చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నటువంటి విద్యాశాఖ సిబ్బంది, వివిధ ఇంజినీరింగ్ విభాగాల అధికారుల కృషి ఎంతో ఉందని కొనియాడారు. కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా పది రోజులపాటు కష్టపడి పని చేసిన అధికారులను అభినందించారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న వైద్య శాఖ సిబ్బందిని కలెక్టర్ ప్రశంసించారు. వీడ్కోలు సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్కుమార్, డీటీడబ్ల్యూవో కోఠాజీ, డీఎస్సీడీవో మల్లేశం, డీఈవో రేణుకాదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, డీఆర్డీవో కృష్ణన్, సీఈవో జానకీరెడ్డి, డీఏవో గోపాల్, డీహెచ్హెచ్వో పాల్వాన్కుమార్, డీపీవో తరుణ్కుమార్, ఆర్డీవో విజయకుమారి, పశువైద్యాధికారి అనీల్కుమార్, ఆయా శాఖల అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.