కడ్తాల్, ఫిబ్రవరి 6 : మండల కేంద్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఆలయంలో స్వామి వారికి అభిషేకం, అర్చనలు, హారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పూలతో అలంకరించిన పెద్ద తేరులో దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను ఉంచి, గ్రామ ప్రధాన పురోహితుడు మెళ్లూరి వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద తేరును గ్రామంలోని ప్రధాన వీధులగుండా ఊరేగించారు. తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 7 గంటల వరకు రథోత్సవం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ హరిశంకర్గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆలయంలో ఆంజనేయస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో భజనలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, ఉప సర్పంచ్ రామకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు భాస్కర్రెడ్డి, నరేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, రాఘవేందర్, గణేశ్గౌడ్, ఈశ్వరప్ప, ఎన్ఆర్ఐ చాట్ల నరేశ్, రవీందర్రెడ్డి, అశోక్, యాదయ్య, వెంకటేశ్, హర్షవర్ధన్, బ్రహ్మచారి, రవిచారి, ప్రేమ్చారి, సాయిప్రభుచారి, సుదర్శన్చారి, జంగాచారి, మహేశ్, రమేశ్ పాల్గొన్నారు.
ఆరుట్లలో..
మంచాల : ఆరుట్ల గ్రామంలో సోమవారం వేణుగోపాల స్వామి రథోత్సవం కనుల పండువగా జరిగింది. జైశ్రీమన్నారాయణ, జైశ్రీమన్నారాయణ అంటూ భక్తులు స్వామి వారికి నీరాజనం పలికారు. రుక్మిణి, సత్యభామ, వేణుగోపాల స్వామి విగ్రహాలను రథోత్సవంపై ఊరేగింపు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు వేణుగోపాల స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. రథోత్సవం ముందు కోలాటాలు, డప్పు వాయిధ్యాలు, కళాకారుల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీటీసీలు చీరాల రమేశ్, ఉపసర్పంచ్ జంగయ్య గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.