కడ్తాల్ : ఆలయ అర్చకుల సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆలయ అర్చక రాష్ట్ర జేఏసీ కన్వీనర్ రవీంద్రచారి, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కృష్ణమాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి అన్నారు. శనివారం మండల పరిధిలోని మైసిగండి ఆలయ ఆవరణలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. టీఎన్జీవోస్ అనుబంధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆలయ అర్చక జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు, అర్చకుల సమస్యలను పరిష్కారిస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలోనే అర్చకులకు వేతానాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. జీవో నెంబర్ 577 ప్రకారం రాష్ట్రంలోని 5625 మంది అర్చక ఉద్యోగులకు గ్రాంట్ఎయిడ్ ద్వారా వేతానాలు చెల్లించాలని కోరారు. అంతకుముందు రాష్ట్ర జేఏసీ నాయకులు మైసమ్మతల్లిని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక ఉద్యోగులు రాములు, కృష్ణ, చంద్రయ్య, దేవేందర్, రమాదేవి, శ్రీనివాసులు, వెంకటేశ్, రామకృష్ణ, సత్యనారాయణ, రవి, హన్మంతు, ఆమూల్యపతి, సతీశ్కుమార్శర్మ, వెంకటరమణ పాల్గొన్నారు.