తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ లైట్లతో ధగధగ లాడాయి. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య, జైపాల్యాదవ్ జాతీయ జెండాను ఎగురవేశారు.అమరుల చిత్రపటాలకు పూలమాలేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధిని వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
ఇబ్రహీంపట్నం బృందం, జూన్ 2 : తెలంగాణ రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అతితక్కువ కాలంలోనే అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి సాధించారని అన్నారు. ఈ ఉత్సవాలను గ్రామస్థాయి నుంచి పట్టణస్థాయి వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, ప్రశాంత్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దండుమైలారం సహకార సంఘంలో చైర్మన్ వెంకట్రెడ్డి, ఉప్పరిగూడలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రామ్మోహన్రావు, ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వెంకటాచారి జాతీయ జెండాను ఎగురవేశారు.
మంచాల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ నర్మద, తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ అనిత, తుర్కయాంజాల్ సహకార సంఘం ఆవరణలో చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, యాచారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీపీ సుకన్య, తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయంపై ఎంపీపీ బుర్ర రేఖ జెండాను ఎగురవేశారు. నియోజకవర్గాల్లోని ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్టు, యాచారం, మంచాల మండలాలతో పాటు పెద్దఅంబర్పేట, తుర్కయాంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలో జెండాను ఎగురవేశారు. నియోజవకర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలపై ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాలను ఎగురవేసి తెలంగాణ ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.
చేవెళ్ల నియోజకవర్గంలో..
షాబాద్: చేవెళ్ల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య జెండా ఎగురవేశారు. షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోని ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు జెండాలు ఆవిష్కరించారు. అనంతరం అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గంలో..
కడ్తాల్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ఆయా మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయజెండాను ఎగురవేశారు. మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, అనిత, తహసీల్దార్ కార్యాలయాల వద్ద తహసీల్దార్లు మురళీకృష్ణ, కృష్ణ, పోలీస్స్టేషన్ల వద్ద సీఐ ఉపేందర్, ఎస్ఐలు హరిశంకర్గౌడ్, సుందరయ్య, వెంకటేశ్, పీఏసీఎస్ కార్యాలయాల వద్ద చైర్మన్లు వెంకటేశ్గుప్తా, కేశవరెడ్డి, తిరుమల్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండలాధ్యక్షుడు పరమేశ్ జాతీయజెండాను ఎగురవేశారు.కార్యక్రమంలో జడ్పీటీసీలు దశరథ్నాయక్, అనురాధ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీలు ఆనంద్, అనంతరెడ్డి, పీఏసీఎస్, ఏఎంసీ డైరెక్టర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
షాద్నగర్ నియోజకవర్గంలో..
షాద్నగర్ : ప్రభుత్వ కార్యాలయల, పార్టీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించి వందనాలను సమర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. సీఎం కేసీఆర్ ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని కొనియాడారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. మున్సిపల్, మండల పరిషత్, గ్రంథాలయంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని జాతీయ జెండాకు వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, వైస్ ఎంపీపీ మౌనిక, కౌన్సిలర్లు మహేశ్వరి, పావని, కౌసల్య, కృష్ణవేణి, ప్రేమలత, శ్రీనివాస్, సర్వర్పాషా, శ్రీనివాస్, రాజేశ్వర్, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి, కమిషనర్ వెంకన్న, ఎంపీడీవో వినయ్ తదితరులు పాల్గొన్నారు.