షాబాద్, జూలై 11: దేశంలో అభివృద్ధికి సూచికగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నదని రంగారెడ్డి జడ్పీచైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. మం గళవారం మండలంలోని హైతాబాద్, పెద్దవేడు, నాందార్ఖాన్పేట్, లింగారెడ్డిగూడ గ్రామాల్లో పల్లెపల్లెకూ అవినాశ్రెడ్డి కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డితో కలిసి ఆమె పా ల్గొన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నా రు. బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో అనితారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గత ఏడు దశాబ్దాల్లో ఏ ప్రభుత్వాలు అమలు చేయని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేపడుతున్నారని కొనియాడారు. ముఖ్యంగా మహిళల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను అమ లు చేస్తున్నారన్నారు. కేసీఆర్ కిట్ సూపర్ హిట్ అయ్యిందని, కల్యాణలక్ష్మి, గురుకులాల్లో బాలికలకు నాణ్యమైన విద్య తదితర పథకాలతో ప్ర భుత్వం అండగా నిలుస్తున్నదన్నారు.
రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, 24 గంటల నిరంతర విద్యుత్తు , నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాతో తెలంగాణ వ్యవసాయం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు జడ్పీటీసీ అవినాశ్రెడ్డి పల్లెపల్లెకూ కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు. మంచి మనస్సుతో అవినాశ్రెడ్డికి ప్రజలందరూ అండగా నిలవాలన్నారు. జడ్పీ నిధులతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో షాబాద్ మండల రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. అనంతరం జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అత్యధికంగా నిధులను తీసుకొచ్చి మండలాన్ని ఆదర్శం గా తీర్చిదిద్దుతానని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికే పల్లెపల్లెకూ కార్యక్రమం పేరు తో అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజ ల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నట్లు వివరించారు. గ్రా మాల్లో కొంతమంది పింఛన్లు, విద్యుత్తు, డబుల్ బెడ్రూం ఇం డ్లు తదితర సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని.. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు.
ఇప్పటికే లక్షలా ది రూపాయలతో అన్ని గ్రామా ల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానని.. మిగిలిన పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు గూడూరు నర్సింగ్రావు, చల్లా శ్రీరాంరెడ్డి, మండల యువజన విభాగం అధ్యక్షుడు పీసరి సతీశ్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు కావలి మల్లేశ్, శ్రీనివాస్గౌడ్, సులోచన, లింగం, మండల కో-ఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, మార్కెట్ కమి టీ మాజీ చైర్మన్లు వెంకటయ్య, శ్రీనివాస్గౌడ్, నర్సింహారెడ్డి, డైరెక్టర్ యాదయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యు డు కొలన్ ప్రభాకర్రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ హైతాబాద్ గ్రామ అధ్యక్షుడు గంగిడి భూపాల్రెడ్డి, పీఏసీఏస్ వైస్ చైర్మన్ మద్దూరి మల్లేశ్, డైరెక్టర్లు చక్కటి దేవేందర్రెడ్డి, జైపాల్, మాజీ సర్పంచ్ దర్శన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యాదిరెడ్డి, నర్సింహారెడ్డి, రాజూగౌడ్, వెంకట్రెడ్డి, సురేశ్గౌడ్, అశోక్గౌడ్, మునీర్, శేఖర్రెడ్డి, దర్శన్, కృష్ణారెడ్డి, సుధాకర్రెడ్డి, దయాకర్చారి, సుధాకర్గౌడ్, శ్రీనివాస్గౌడ్, గోపాల్, శివకుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.