తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 3. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో ప్రమాణాలను పెంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు నేటి తరం యువత అందిపుచ్చుకునేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి అన్నారు. సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ కళాశాలలో ‘భారతదేశంలో ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్ కోసం ఒక పద్ధతి’ అనే అంశంపై శనివారం జరిగిన జాతీయ స్థాయి సెమినార్లో లింబాద్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వం ఉన్నత విద్యారంగానికి కల్పిపిస్తున్న ప్రాధాన్యతపై ప్రసంగించారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకునే వినూత్న విద్యావిధానంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఆయా విభాగాల అధ్యాపకులు రచించిన పలు పుస్తకాలను వక్తలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఓయు వైస్ చాన్సలర్ డి. రవీందర్, హెచ్సీడీసీ డైరక్టర్ ప్రొఫెసర్ స్టీవెన్సన్, రిసోర్సుపర్సన్స్ డాక్టర్ ఎస్పీ వేణుమాధవ్, సి.హెచ్. శ్రీనివాస్, డాక్టర్ కె.ఎస్ విజయ శేఖర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. సుందర్రెడ్డి పాల్గొన్నారు.