షాద్నగర్ రూరల్, జూన్ 1: తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ వెంకట్రా రెడ్డి, సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు. అలాగే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ కోదండరామ్కు వినతిపత్రం అందజేశారు.
షాద్నగర్ పట్టణంలో తెలంగాణ అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించేలా చూడాలని కోరారు. ఉద్యమకారుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల కోసం రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో సమితి సభ్యులు శ్రీనివాస్, ఆర్ల యాదయ్య, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, రాజు, బాలు నాయక్, నర్సింహులు, రవికుమార్ గౌడ్ పాల్గొన్నారు.