కడ్తాల్, సెప్టెంబర్ 3: గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలు చాలా గొప్పవని, తీజ్ పండుగ గిరిజన మహిళలకు ఎంతో విశిష్ఠమైనదని ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పల్లెచెల్క తండాలో సర్పంచ్ లోకేశ్నాయక్, గిరిజన నాయకుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తీజ్ పండుగ గిరిజనుల సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తున్నదని తెలిపారు. గిరిజన యువతులు, మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో తీజ్ పండుగను జరుపుకొంటారని పేర్కొన్నారు. తండాలోని యువతులు ఎంతో నియమ నిష్టలతో మొలకల బుట్టలను తయారుచేశారని పేర్కొన్నారు.
అనంతరం యువతులు తయారు చేసిన మొలకల బుట్లను ప్రజాప్రతినిధులు నెత్తిన ఎత్తుకున్నారు. అంతకుముందు తండాలోని చావిడి వద్ద ఏర్పాటు చేసిన మొలకల బుట్టల పందిరి వద్ద యువతులకు నాయకులు బుట్టలను అందజేశారు. సాయంత్రం యువతులు బట్టులకు పూజలు నిర్వహించి చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆచారి, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్లు లోకేశ్నాయక్, భారతమ్మ, నర్సింహాగౌడ్, ఎంపీటీసీ రాములుగౌడ్, నాయకులు దీప్లానాయక్, మధు, బీచ్చానాయక్, బీమ్లా, శ్రీనునాయక్, బాలునాయక్, నవీన్, లోక్యా, మాన్సింగ్, మన్యా, రమేశ్, బాల్దాసు, నరేశ్, నర్సానాయక్, భీక్యానాయక్, గోపాల్, జంగయ్యగౌడ్, మహేందర్గౌడ్, చంద్రయ్య, యాదయ్య, హరిచంద్ర, కృష్ణయ్య, నర్సింహ, తండావాసులు పాల్గొన్నారు.