కడ్తాల్, ఆగస్టు 30; కడ్తాల్ మండలంలోని మైసిగండి గ్రామంలో బుధవారం తీజ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తిశ్రద్ధలతో గిరిజనులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యువతులు మొలకల బుట్టలను ఎత్తుకొని, డప్పుల వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లి స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.
కడ్తాల్, ఆగస్టు 30: గిరిజనుల సంస్కృతీ, సంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తున్నదని, తెలంగాణలో పూర్వ కాలం నుంచి వస్తున్న ఆచారాలు చాలా గొప్పవని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో గిరిజనులు తీజ్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వేర్వేరుగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీలో తీజ్ ఉత్సవం భాగమని, మన సంస్కృతి, సంప్రదాయాలను సంరక్షించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. గిరిజనులు నిర్వహించే తీజ్ పండుగకు చాలా ప్రాధాన్యత ఉన్నదని, తొమ్మిది రోజులపాటు గిరిజన యువతులు ఎంతో కఠినంగా దీక్ష చేపడుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి ఎమ్మెల్సీ నృత్యం చేశారు.
గ్రామంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులుగా తండాకు చెందిన యువతులు ఎంతో నియమ నిష్టలతో మొలకల బుట్టలను తయారు చేశారు. గిరిజన యువతులు బుట్టలను ఎత్తుకొని, డప్పుల వాయిద్యాల మధ్య స్థానిక అమ్మ వారి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం తండాలోని చావిడి వద్ద ఏర్పాటు చేసిన మొలకల బుట్టల పందిరి వద్ద యువతి, యువకులు డ్యాన్స్లు చేశారు. అనంతరం మొలకలను స్థానిక చెరువులో నిమజ్జనం చేయడానికి భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచులు తులసీరాంనాయక్, లక్ష్మీనర్సింహారెడ్డి, వెంకటేశ్వర్లుగౌడ్, పాండు, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, ప్రియ, ఉప సర్పంచ్లు రాజారాం, రామకృష్ణ, నాయకులు హన్మానాయక్, భాస్కర్రెడ్డి, యాదగిరిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, భిక్షపతి, నరేశ్నాయక్, శ్రీనివాస్గౌడ్, భాస్కర్నాయక్, అరుణ్కుమార్, లక్ష్మణ్నాయక్, అమృనాయక్, పాండునాయక్, హర్యానాయక్, దూద్యానాయక్, దాస్లా, శివ, శ్రీనివాస్, రవి, రెడ్యానాయక్, కిషన్, హీరాసింగ్ పాల్గొన్నారు.