తాండూరు రూరల్ : తాండూరు మండలం, మిట్టబాసుపల్లి సర్పంచ్ నరేందర్రెడ్డిపై ఉప సర్పంచ్ గోవింద్ దాడికి పాల్పడ్డాడు. మంగళవారం పోలీసులు, గ్రామస్తులు కథనం ప్రకారం.. సర్పంచ్ నరేందర్రెడ్డి బైక్పై వెళ్తుండగా, ఉప సర్పంచ్ గోవింద్ గ్రామ చావిడి దగ్గర బైక్ను ఆపి తనకు మిస్సిడ్ కాల్ ఎందుకు ఇచ్చావు అంటూ పరుష పదజాలంతో దూషించడంతో పాటు చెప్పుతో పాటు చేతులతో దాడికి పాల్పడినట్లు తెలిపారు. అయితే విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు ఒక్కటి కావడంతో ఉప సర్పంచ్ గోవింద్ అక్కడి నుంచి పారీపోయాడు. సర్పంచ్ నరేందర్రెడ్డితో పాటు సుమారు 200మంది గ్రామస్తులు కలిసి కరణ్కోట పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలీసు స్టేషన్లో ఈ దాడికి సంబంధించిన విషయాలపై గ్రామస్తులతో పోలీసులు చర్చించారు.
దాడికి పాల్పడిన ఉపసర్పంచ్ గోవింద్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీసులు గ్రామస్తులను స్టేషన్లోకి రాకుండా గేటు ముందే అడ్డుకున్నారు. ఇదిలావుండగా ఈ నెల 7న ఉప సర్పంచ్ గోవింద్పై సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ ఆర్డీవో, జిల్లా కలెక్టర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇదంతా మనస్సులో పెట్టుకొనే సర్పంచ్పై దాడి చేసి ఉంటారని గ్రామస్తులు బావిస్తున్నారు. సర్పంచ్ నరేందర్రెడ్డి ఫిర్యాదు మేరకు ఉపసర్పంచ్ గోవింద్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గ్రామంలోని సీసీ పుటేజీలను కూడా పరిశీలిస్తామని ఎస్సై తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై ఏడుకొండలు తెలిపారు.