తాండూరు రూరల్ : పేకాటాడుతున్న ఏడుగురి వ్యక్తులను అరెస్టు చేశామని కరణ్కోట ఏఎస్ఐ సత్తయ్య ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. తాండూరు మండలం, చెన్గేష్పూర్ గ్రామ శివారులో శ్రీనివాస్, బిచ్చప్ప, మాల శ్రీనివాస్, రమేశ్, అశోక్, హేమంత్, అంజిలయ్యలు పేకాటడుతుండగా పక్క సమాచారంతో ఘటన స్థలానికి చేరుకుని దాడులు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 9,800లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.