తాండూరు, అక్టోబర్ 29: కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు షురువైతయి…కుర్చీ కోసం కొట్లాడే నాయకులకు ప్రజలను పట్టించుకునేంత సమయం ఉంటుందా…డబ్బులు ఇస్తే జనం ఓటేస్తారా…ఎక్కడనుంచో గిప్పుడొచ్చి ఓట్లేయమంటే కాంగ్రెస్కు వేస్తారా? ప్రజల గురించి నిత్యం ఆలోచించే సీఎం కేసీఆర్తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతది… తాండూరు నియోజక వర్గం అభివృద్ధికి రూ.1672.49 కోట్లు, ప్రజా సంక్షేమ పథకాలకు రూ.1648.12 కోట్లు తెచ్చిన ఘనత తమదేనని తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థి పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. తాండూరు మరింత అభివృద్ధి చెందాలంటే నియోజక వర్గం ప్రజ లందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. ఆదివారం తాండూరు మున్సిపల్ పరిధిలోని సాయిపూర్తో పాటు పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించంగా ప్రజలు బ్రహ్మ రథం పట్టారు.
ఈ సందర్భంగా కాలనీల్లో నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిదిన్నర ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో తాండూరు పట్టణ అభివృద్ధి పనులకు రూ.1191.86 కోట్లు, తాండూరు మండలంలో అభివృద్ధి పనులకు రూ. 236.14 కోట్లు, యాలాల మండలంలో అభివృద్ధి పనులకు 97.77 కోట్లు, బషీరాబాద్ మండలంలో అభివృద్ధి పనులకు 68.18 కోట్లు, పెద్దేముల్ మండలం అభివృద్ధి పనులకు రూ.78.54 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అభివృద్ధి ఇట్లనే కొనసాగాలంటే కారుకే ఓటేయాలని సూచించారు. ప్రాణాలు లెక్కచేయకుండా కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో
తాండూరు పక్కనే ఉన్న కాంగ్రెస్ పాలిత కర్ణా టక రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు లేవన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్తోనే భారతదేశం అభివృద్ధి, పేదల సంక్షేమం సాధ్యమన్నారు. మహిళల కష్టాలు తీర్చడం కోసం మిషన్ భగీరథద్వార ఇంటింటికీ తాగు నీరు, అర్హులైన పేదలకు ఆసరా పింఛన్లు ఇస్తున్నామన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు కార్ఫోరేట్ స్థాయిలో వైద్యసేవలు, విద్యార్థులకు గుణా త్మకమైన విద్యను అందించుటకు గురుకులాలు, మోడల్ స్కూల్తో పాటు ప్రభుత్వ పాఠ శాల, కళాశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ఎకరానికి రూ.16 వేల రైతు బంధు, సౌభాగ్యలక్ష్మి పేరుతో పేద మహిళలకు రూ.3000, రూ.400లకే వంటగ్యాస్, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం, కేసీఆర్ ఆరోగ్యరక్ష ద్వారా వైద్య చికిత్సలకు రూ.15 లక్షలు, రేషన్పై సన్న బియ్యం, అర్హులైన వారికి రూ.5016 ఆసరా పెన్షన్లు, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, స్వశక్తి మహిళా గ్రూపులకు భవనాలతో పాటు పలు నూతన పథకాలను ప్రవేశ పెట్టను న్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పరుషోత్తంరావు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప, గులాబీ నేతలు నయీం, పట్లోళ్ల నర్సింహులు, పరిమళ, శోభారాణి, సంగీతఠాకూర్ తదితరులున్నారు.