తాండూరు : మార్వాడి యువమంచ్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని బాలాజీ మందిరంలో కొనసాగుతున్న ఉచిత జైపూర్ కాళ్ల అమరిక, కెలిపర్ శిబిరమును శుక్రవారం ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల ద్వారా 250మంది వరకు వైద్య శిబిరంలో ఉచితంగా చికిత్స, జైపూర్ కాళ్ల అమరికలు చేయించిన నిర్వాహకులను అభినందించారు.
సమసమాజ అభివృద్ధికి మార్వాడి యువమంచ్ చేస్తున్న సేవలు మరవలేనివని పేర్కొన్నారు. తమ ద్వారా కూడ కావాల్సిన సహాయం అందిస్తామన్నారు.