తాండూరు రూరల్ : తాండూరు మండలం, కొత్లాపూర్లోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఆదివారం కర్నాటక అటవీ శాఖ మంత్రి అరవింద నింబవాళి సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నూతన కమిటీ చైర్మన్ సందీప్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, రైతుబంధు సమితీ కన్వీనర్ రాంలింగారెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు.