తాండూరు రూరల్ : కులాంతర వివాహలు చేసుకున్న వారికి ప్రభుత్వం ఆదుకుంటుందని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో కులాంతర వివాహం చేసుకున్న రెండు జంటలకు రూ. 2.50 లక్షల ఆర్థిక సహాయం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాంతర వివాహలు చేసుకున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం చేయూతనిస్తుందని, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.