తాండూరు రూరల్ : మల్కాపూర్ నాపరాతి గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరు మండలం, కొత్లాపూర్ గ్రామానికి చెందిన బైండ్ల శాణమ్మ నాపరాతి గనుల్లో రోజూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. మల్కాపూర్ గ్రామ పరిధిలోని సుద్ధ భాస్కర్రెడ్డికి చెందిన నాప రాతి గనిలో నాప రాయి కటింగ్ చేస్తున్న క్రమంలో బండరాయి విరిగిపడి చేతివేళ్ల మీద పడింది. దీంతో చేతి వేళ్లు పూర్తిగా కట్ అయ్యాయి. ప్రమాదం జరిగిందని యజమానికి సూచిస్తే, పట్టించు కోవడం లేదని కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం చికిత్స కూడా చేయించ లేదని వాపోయింది. కార్మిక నాయకులు, అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది.