సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : అవినీతి అక్రమాలు, మహిళలతో అసభ్య ప్రవర్తన, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసులపై పోలీసు బాస్లు సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. హైదరాబాద్లో పంజాగుట్ట ఠాణాలో 85 మంది ఒకేసారి బదిలీ కావడం, ఆ ఠాణా మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును అరెస్ట్ చేసిన విషయం మరువకముందే సైబరాబాద్లో మరో ఇన్స్పెక్టర్పై వేటు పడింది. మియాపూర్ ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్, స్టేషన్కు వచ్చిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి మంగళవారం సస్పెండ్ చేశారు. ట్రై కమిషనరేట్లలోని ఠాణాలలో కొందరు అధికారుల అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుండడంతో ఆయా ఠాణాలు వార్తల్లోకి ఎక్కుతున్నాయి. అవినీతి, అక్రమాలకు అడ్డాలుగా మారిన వాటిని చక్కబెట్టేందుకు పోలీస్ కమిషనర్లు శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంత మందిపై బదిలీ వేటు వేస్తున్న ఉన్నతాధికారులు, తమకు ఫిర్యాదులు వచ్చే వాటిపై అంతర్గతంగా విచారణ జరుపుతూ సస్పెండ్ చేస్తున్నారు.
ఇటీవల జరిగిన ఘటనలు..