బొంరాస్పేట, జూలై 20 : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ప్రతి నెలా బియ్యం అందజేస్తున్నారు. అయితే బియ్యం పంపిణీ మరింత పారదర్శకంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. పేదలకు అందించే బియ్యం పక్కదారి పట్టకుండా ప్రతినెలా లబ్ధిదారులకు అందించడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నది. వినియోగదారులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి రేషన్ పంపిణీని ఆన్లైన్ ద్వారా లబ్ధిదారు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా బియ్యం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
బియ్యంలో తరుగు లేకుండా..
అలాగే రేషన్ డీలర్లకు ఎంఎల్ఎస్ కేంద్రాల ద్వారా పంపి ణీ చేసే బియ్యంలో ఏమాత్రం తరుగు లేకుండా కచ్చితమైన తూకంతో సరఫరా చేయడానికి ప్రభుత్వం డీలర్లకు కూడా బయోమెట్రిక్ విధానాన్ని ఈ నెల నుంచే అమలు చేస్తున్నది. ఈ విధానం ద్వారా డీలర్లకు బస్తాలో ఎన్ని కిలోల బియ్యం ఉంటాయో అంతే బరువు ఈపాస్ యం త్రంలో నమోదవుతుంది. బయోమెట్రిక్ విధానంపై డీల ర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పంపిణీలో అమలు చేస్తున్న సాంకేతిక విధానాన్ని మండల్ లెవల్ స్టాక్ పా యింట్లలో(ఎంఎల్ఎస్) కూడా అమలు చేస్తున్నారు. ఈ నెల నుంచే వికారాబాద్ జిల్లాలో ఈ విధానాన్ని పౌర సరఫరాల శాఖ అమలు చేస్తున్నది. ఇందుకు అవసరమైన చ ర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాలోని ఎంఎల్ఎస్ స్టాక్ పాయింట్ల ద్వారా బయోమెట్రిక్ విధానం ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నారు. డీలర్లు స్టాక్ పాయింట్లకు వెళ్లి ఈ పాస్ యంత్రంలో వేలి ముద్రలు వేసి తమ దుకాణంలోని కార్డుల సంఖ్య ఆధారంగా కచ్చితమైన తూకంతో బియ్యం తీసుకుని వినియోగదారులకు పంపిణీ చేస్తారు.
ఈ-పాస్తో..
వికారాబాద్ జిల్లాలో వికారాబాద్, తాండూ రు, మోమిన్పేట్, పరిగి, కొడంగల్లో మం డల్ లెవల్ స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వీటి గోదాముల నుంచే జిల్లాలోని 588 రేషన్ దుకాణాలకు ప్రతి నెలా 4,500 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. స్టాక్ పాయింట్ల నుంచి డీలరుకు ఎన్ని క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయాలో అన్ని బస్తాల ను తూకం వేసి సరఫరా చేస్తున్నారు. దుకాణాల వద్ద లబ్ధిదారులు వేలి ముద్రలు వేసినప్పుడు ఈ-పాస్కు తూకం యంత్రాన్ని ఎలా అనుసంధానం చేస్తారో అదే విధానాన్ని స్టాక్ పాయింట్ గోదాముల వద్ద డీలర్ల వేలి ముద్రలతో బియ్యం అందజేస్తున్నారు. ఈ విధానంతో స్టాక్ పాయింట్ గోదాముల నుంచి జిల్లా కేంద్రాలకు, అక్కడి నుంచి పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయానికి డీలర్లకు సరఫరా చేసిన బియ్యం లెక్కలు ఈ-పాస్ ద్వారా వెళ్తా యి. కొత్త విధానం ద్వారా డీలర్లకు కార్డుల సంఖ్య ఆధారంగా సరఫరా చేసిన బియ్యం లెక్క కచ్చితంగా ఉంటుం ది. ప్రతినెలా డీలరుకు స్టాక్ పాయింట్ నుంచి ఎన్ని క్వింటాళ్ల బియ్యం సరఫరా చేశారు, ఎన్ని క్వింటాళ్ల బియ్యం వినియోగదారులకు పంపిణీ చేశారు, మిగులు ఎంత ఉందనే వివరాలు కచ్చితంగా తెలుస్తాయి. ఇదిలా ఉండగా దారిద్య్రరేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ఆరు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంది. జిల్లాలో 8.40 లక్షల మంది ప్రతి నెలా రేషన్ బియ్యం తీసుకుంటున్నారు.
బయోమెట్రిక్ విధానం బాగుంది
బయోమెట్రిక్ విధానంలో స్టాక్ పాయింట్ల నుంచి డీలర్లకు బియ్యం సరఫరా చేసే పద్ధతి బాగుంది. గతంలో తూకం వేయకుండానే బస్తాకు 50 కిలోల చొప్పున లెక్కకట్టి బస్తాల లెక్కన బియ్యం సరఫరా చేసేవారు. ఇప్పుడు డీలరు వేలిముద్రలను తీసుకుని బస్తాలను తూకం వేసి ఇస్తున్నారు. దీంతో ఎన్ని క్వింటాళ్ల బియ్యం సరఫరా చేసింది కచ్చితమైన లెక్క ఉంటుంది. డీలర్లకు కూడా నష్టం ఉండదు.
– రాములు, రేషన్ డీలర్, బొంరాస్పేట
ఈ నెల నుంచే అమలు చేస్తున్నాం
రేషన్ బియ్యం పంపిణీ మరింత పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నెల నుంచే డీలర్లకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసున్నది. జిల్లాలోని ఐదు స్టాక్ పాయింట్లలో ఈ-పాస్ యంత్రాల్లో డీలర్ల వేలి ముద్రలు తీసుకుని కచ్చితమైన తూకంతో బియ్యం సరఫరా చేస్తున్నాం. దీంతో ఈ-పాస్లో వేలిముద్రలు ఉన్నవారే బియ్యం తీసుకెళ్లడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే బియ్యం పక్కదారి పట్టకుండా ఉంటుంది. గతంలో బియ్యంలో తరుగు వచ్చేదని డీలర్లు ఫిర్యాదు చేసేవారు. ఇకపై అలాంటి సమస్య ఉండదు.
– విమల, పౌరసరఫరాల శాఖ మేనేజర్