దోమ, జనవరి 30: విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచు కొని ప్రణాళికా బద్ధంగా లక్ష్యసాధనకు కృషి చేయాలని జిల్లా నోడల్ అధికారి శంకర్, విశ్రాంత ఉపాధ్యాయుడు రాధాకృష్ణ అన్నారు. దోమ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం వ్యక్తిత్వ వికాస నిర్మాణం అనే అం శంపై కళాశాల ప్రిన్సిపాల్ మంజుల అధ్యక్షతన అవగాహన కార్య క్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లా డుతూ విద్యార్థులు గురువుల సలహాలు సూచనలు పాటిస్తూ లక్ష్యసాధనకు కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలను శ్రద్ధగా వినాలన్నారు. అకాడమీ పాఠ్య పుస్తకాలను క్షుణ్ణంగా చదవడంతో పాటుగా స్వతహాగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని సూచించారు. అనంతరం నోడల్ అధికారి శంకర్ కళాశాల రికార్డులను పరిశీలించారు. కార్యక్రమం లో అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.