తాండూరు, డిసెంబర్ 24: తాండూరు ప్రభుత్వ జూనియ ర్ కళాశాల నిర్మాణానికి రూ.2 కోట్లను కేటాయించడాన్ని హర్షి స్తూ శనివారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి చిత్రపటానికి విద్యార్థులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజూగౌడ్మాట్లాడుతూ విద్యావైద్యం రంగాల అభివృద్ధికి సీ ఎం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో విద్య, వైద్యం అం దుతున్నదన్నారు.
తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలను సీఎం కేసీఆర్, మం త్రి సబితారెడ్డి దృష్టికి తీసుకెళ్లి నూతన భవన నిర్మాణానికి రూ.రెండు కోట్ల నిధులను ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మంజూరు చేయించడాన్ని ఆయన హర్షించారు. అనంతరం బీఆర్ఎస్వీ తాండూ రు డివిజన్ ప్రతినిధి జిలానీ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో బీఆర్ఎస్కేవీ తాండూరు డివిజన్ అధ్యక్షుడు గోపాల్, అధ్యాపకులు, విద్యార్థులున్నారు.