తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ ఆలయాలకు పూర్వవైభవం తెస్తుందని ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరేటి వెంకన్న అన్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలో రూ. 25 లక్షలతో గ్రామ సర్పంచ్ సొంతంగా నిర్మించిన పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా విచ్చేసి ఆలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీలను సర్పంచ్ లలితజ్యోతయ్య ఘనంగా సన్మానించారు.
అంతకు ముందు పోచమ్మ అమ్మవారిని గ్రామంలో ఊరేగింపు చేసి ఆలయంలో వేదమంత్రోచ్చరణతో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వారికి సమాజంలో తరగని ఆదరణ గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటేశ్, ఎంపీపీ నిర్మల, ఎంపీటీసీ హేమ, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు గోపాల్నాయక్, విఠల్, శేఖర్, శ్రీనివాస్, యాదగిరి, రాములు, పెంటయ్య, కృష్ణయ్య, యాదయ్య, రవి పాల్గొన్నారు.