మహేశ్వరం, మే 26: మహేశ్వరం నియోజకవర్గం విద్యానిలయాలుగా కాకుండా ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం కొత్వాల్ చెరువు తండాలో రూ. 25 లక్షలతో ఇంద్రారెడ్డి ట్రస్టు ద్వారా నిర్మించిన 30 అడుగుల భారీ శివుని విగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు కార్తిక్రెడ్డితో కలిసి ఆమె ఆవిష్కరించారు. మంత్రికి వేద పండితులచే పూర్ణకుంభంతో కొత్వాల్ చెరువు తండా సర్పంచ్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఉదయం నుంచి నాయకులు కార్తిక్రెడ్డి, కల్యాణ్రెడ్డి దంపతులు పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహేశ్వరం మండలం అభివృద్ధికి కేరాఫ్గా రూపుదిద్దుకుంటుందని ఆమె అన్నారు. దేవాలయాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. నియోజక వర్గంలోని పురాతన దేవాలయాలకు రూ. 8కోట్లు కేటాయించడం జరిగిందని ఆమె తెలిపారు. మహేశ్వరంలో బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ గుడి నిర్మించడంతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. మండలంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక, పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతున్నామని ఆమె తెలిపారు.
నియోజక వర్గంలోని బాలాపూర్ దేవతల గుట్ట వద్ద స్వర్గీయ ఇంద్రారెడ్డి ట్రస్టు ద్వారా భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సునితా ఆంద్యానాయక్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు బాలకిషన్, అరవింద్శర్మ, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చంద్రయ్య, కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్రెడ్డి, వైస్ చైర్మన్ ఆనందం, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు మల్లేశ్యాదవ్, బీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం, కందుకూరు అధ్యక్షుడు రాజునాయక్, జయేందర్, తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షుడు లక్ష్మయ్య నాయకులు యాదయ్య, చంద్రయ్య ముదిరాజ్, దీప్లాల్ బడంగ్పేట్, మీర్పేట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.