చేవెళ్ల రూరల్/చేవెళ్లటౌన్/శంకర్పల్లి/మొయినాబాద్, అక్టోబర్ 4: అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం సాగుతున్నద ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రె డ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆమె పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం చేవెళ్ల మం డలంలోని కౌకుంట్ల, మొయినాబాద్ మండలం లోని రెడ్డిపల్లి, శంకర్పల్లి మండల కేంద్రంలో మహిళలకు బతుకమ్మ చీరలు, వృద్ధులకు ఆసరా పింఛన్ పత్రాలు, స్పోర్ట్స్ కిట్లను యువతకు పం పిణీ చేశారు. అదేవిధంగా చేవెళ్ల మండల కేం ద్రంలో రూ.50 లక్షలతో చేపట్టనున్న డీసీఎంఎస్ గోదాము నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శంకర్పల్లి మున్సిపాలిటీలో రూ.1.80 కోట్లతో నిర్మించిన ఆడిటోరియం, మోకిలాలో నూతన గ్రామపంచాయతీ భవనం, మిర్జాగూడలో రూ. 10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడు తూ.. సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని..దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని కొనియాడారు.
ప్రతి ఇ ల్లూ ఏదో ఒక ప్రభుత్వ పథకంతో లబ్ధి పొందు తున్నదని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్య లతో ఇంటింటికీ శుద్ధి చేసిన తాగునీరు అందు తున్నదన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంతో రాష్ట్రం లోని 12 వేల గ్రామాల రూపు రేఖలు మారాయచెప్పారు.కోట్లాది రూపాయలతో వైకుంఠధామా లు, సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతివనాలు, హరితహారం నర్సరీలు, గ్రామీణ యువతకు అనువు గా ఉండేందుకు క్రీడా మైదానాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దసరా పండుగను పు రస్కరించుకుని ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చేనేత చీరలను పంపిణీ చేస్తున్నట్లు.. వితం తువులకు ఆసరాపథకం ద్వారా పింఛన్ను స ర్కారు మంజూరు చేస్తున్నదన్నారు.
అంతేకా కుండా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఇతోధికం గా కృషి చేస్తున్నదన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్తుతోపాటు రైతుబంధు, రైతుబీమా, విత్తనాలు, ఎరువులను నిల్వ ఉంచేందుకు గోదాము లను నిర్మించిందన్నారు. సీఎం కేసీఆర్ కృషితో అన్నదాతలు తమ పంటలను సాగు చేసుకుం టూ ఆనందంగా జీవిస్తున్నారని మంత్రి సబితా రెడ్డి అన్నారు. రైతు రాజుగా మారి గర్వంగా జీవిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు మద్దతుగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు, బీ ఆర్ఎస్ శ్రేణులకు మంత్రి సూచించారు.
ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ బుయ్య ని మనోహర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల చైర్మన్ నారాయణ, ఆయా మండలాల ఎంపీపీ లు విజయలక్ష్మి, గునుగుర్తి నక్షత్రం, గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీలు మాలతి, కాలె శ్రీకాంత్, గోవింద మ్మ, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు వెంకటరంగారెడ్డి, పాపారావు, వైస్ చైర్మన్ వెంకటేశ్, బీఆర్ఎస్ పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు ప్రభాకర్, మహేందర్రెడ్డి, గోపాల్, వాసుదేవ్కన్నా, వైస్ ఎంపీపీలు శివప్రసాద్, మమత, ఎంపీడీవోలు హిమబిందు, సంధ్య, వెంకయ్య, మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్, మాజీ ఎంపీపీ బాల్రాజ్, సర్పంచులు గాయ త్రి, సులోచన, విజయలక్ష్మి, సురేందర్, అనూ ష, శైలజారెడ్డి, నాయకు లు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, గోపాలకృష్ణ, అంజన్గౌడ్, నర్సింహు లు, సత్తయ్యగౌడ్, హన్మంత్రెడ్డి, నరేందర్, నాగార్జున రెడ్డి, ఉప సర్పంచ్ ఇనాయత్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, మల్లారెడ్డి, పాండు, నర్సింహులు, యాద య్యగౌడ్, మార్కెట్ కమి టీ మాజీ వైస్ చైర్మన్ మాణిక్యరెడ్డి, గిరిధర్రెడ్డి, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, మాణిక్యరెడ్డి, జహంగీర్, ఉప సర్పం చ్ యాదయ్య, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, వెంకటేశ్, కృష్ణ, మహేశ్, మాధ వగౌడ్, రఘవేందర్రెడ్డి, రవికాంత్రెడ్డి, తిరుపతిరెడ్డి, మహేందర్రెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ శశిధర్రెడ్డి, వెంకట్రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు ఇంద్రాసేనారెడ్డి, ఫరీద్, వెంకట్రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్గౌడ్, వెంకటేశ్, కాంత్రెడ్డి, సర్పంచులు సుమిత్రామోహన్రెడ్డి, నర్సింహారెడ్డి, లలితానర్సింహ, సర్పంచ్ వినీత, సర్పంచ్ల సంఘం మండలా ధ్యక్షుడు నరోత్తంరెడ్డి, వైస్ ఎంపీపీ మమత, చిలుకూరు సర్పంచ్ స్వరూప, ఎల్కగూడ సర్పం చ్ కుమార్, ఎంపీటీసీ అంజయ్య, బీఆర్ఎస్ రా ష్ట్ర నాయకుడు అనంతరెడ్డి, నర్సింహారెడ్డి, కృష్ణారెడ్డి, గణేశ్రెడ్డి, తిరుపతిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రావూఫ్, మాజీ వైస్ చైర్మన్ రాజు, జయవంత్, సుధాకర్యాదవ్, నర్సింహాగౌడ్, ప్రవీణ్, శేఖర్, వివేక్, ఉదయ్, రవీందర్రెడ్డి, రాంరెడ్డి, మోహన్రెడ్డి, జగదీశ్వర్రెడ్డి, శంకయ్య, రాంచంద్రయ్య, యాదగిరి, రాము లు, షాబాద్ దర్శన్, పరమేశ్, రమేశ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కందుకూరు మండల ఉపాధ్యక్షుడు జంగయ్య ఆధ్వర్యంలో చేవెళ్ల మండలంలోని దెబ్బడగూడ గ్రామానికి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా మాజీ ఉపాధ్యక్షుడు వెంకటేశ్, బీజేపీ బూత్ లెవల్ అధ్యక్షుడు గణేశ్దేవ్, సీనియర్ నాయకులు రామకృష్ణ, సునీల్, శ్రీకాంత్, మహేశ్, మధు తదితరులు మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో పార్టీ కందుకూరు మండల మహిళా విభాగం నాయకురాలు విజయ, జైత్వారం ఎంపీటీసీ సురేశ్ పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని.. సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేవెళ్ల నియోజకవర్గం ఊహించని విధంగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నదన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్కు అండగా నిలవాలని వారు కోరారు.