షాద్నగర్ రూరల్, డిసెంబర్ 2: ప్రజలకు వివిధ వ్యాధులపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర సీపీహెచ్సీ ప్రోగ్రామ్ అధికారి రవికుమార్ ఏఎన్ఎంలకు సూచించారు. శుక్రవారం షాద్నగర్ డివిజన్లోని అన్ని పీహెచ్సీల్లోని ఏఎన్ఎంలకు షాద్నగర్ డిప్యూటీ డీ ఎంఅండ్హెచ్వో డాక్టర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీహెచ్సీ శిక్షణా తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణులకు క్షేత్రస్థాయిలో వైద్య సేవలను అం దించాలని ఆయన ఏఎన్ఎంలకు సూచించారు. వారికి బీపీ, షుగర్, క్యాన్సర్, సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ చికున్గున్యా తదితర వ్యాధులపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు విద్యులత, ప్రమీల, స్వరాజ్యలక్ష్మి, హెల్త్ ఎడ్యూకేటర్ శ్రీనివాసులు, శ్రీహరి, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.
కంటి వెలుగుపై సమీక్ష
షాద్నగర్టౌన్, డిసెంబర్ 2: షాద్నగర్ పట్టణంలోని డిప్యూటీ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం డివిజన్లోని పీహెచ్సీల వైద్యాధికారులు, హెల్త్ సూపర్వైజర్లు, ఫార్మాసిస్టులకు డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ జయలక్ష్మి ‘కంటి వెలుగు’పై సమీక్ష నిర్వహించారు. జనవరి 18 నుంచి రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం అవుతుందని ప్రతి బృందంలో మెడికల్ అధికారి, డాటా ఎంట్రీ ఆపరేటర్, హెల్త్ సూపర్వైజర్, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్ద రు ఆశ వర్కర్లు ఉంటారన్నారు. ప్రతిరోజూ 400 మందికి కంటిపరీక్షలు చేసి అవసరం ఉన్న వారికి అద్దాలను పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, శ్రీహ రి, ఫార్మాసిస్టులు పాల్గొన్నారు.