ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శ్రీసీతారాముల కల్యాణం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీరామ జయరామ జయ జయ రామ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి పారవ శ్యంతో తన్మయత్వం చెందా రు.
అర్చకస్వాముల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య స్వామి వారి కల్యాణం నయనానందకరంగా సాగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని కౌకుంట్లలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రత్యేక పూజ లు నిర్వహించి గ్రామస్తులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.