యాలాల, డిసెంబర్ 28: మండల వ్యాప్తంగా ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రీడామహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ బాలేశ్వర గుప్తా తెలిపారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మండల పరిధిలోని పీడీ, పీఈటీ ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీల ప్రారంభించిన అనంతరం మంత్రి, ఎమ్మెల్యే కేజీబీవీ కళా శాల అదనపు గదులను, రైతువేదికను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా 6 నుంచి 8 తరగతి విద్యార్థులను జూనియర్లుగా 9, 10 తరగతి విద్యార్థులను సీనియర్లుగా పరిగణించి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, లాంగ్జంప్, షాట్ఫుట్, రన్నింగ్, డిస్కస్త్రో, జావలిన్త్రో, క్యారమ్స్, చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం క్రీడల నిర్వహణకు గ్రౌండ్ను పరిశీలించారు.